బీజేపీ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్సి కవిత పై అనుచిత వాక్యాలు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై శంబీపూర్ రాజు ధ్వజమెత్తారు.  పసుపు బోర్డు పేరుతొ ఓట్లు వేయించుకొని హామీలను గాలికి వదిలిన అరవింద్ ఆడబిడ్డపై రాజకీయులు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ విలువలు మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై మర్యాద లేకుండా మాట్లాడుతూ కవిత పై వ్యక్తిగతంగా వాక్యాలు చేయడం మనుకోకుంటే నాలుక కోస్తామన్నారు. తండ్రి కొడుకులు పూటకో పార్టీ మారుస్తూ పగటి వేషగాళ్లలా తిరిగె మీరు మా నాయకుల పై పార్టీ మార్పు ఆరోపణలు చేయడం విడ్డురమన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పారు అంటున్న ఎంపీ అరవింద్ కాంగ్రేస్ నేతలతో నిత్యా సంబంధాల్లో ఉన్నట్టు ఒప్పుకుంటున్నట్టే కదా అని ఎద్దేవా చేసారు. బిడ్డను అమ్ముకుంటున్నారు అనే బలుపు మాటలు మాట్లాడి తల్లిదండ్రుల విలువలు దిగజారుస్తూ మాట్లాడటం పట్ల తెలంగాణ సామాజమం సిగ్గుపడుతుంది అని గుర్తుచేసారు. తన ఇంటిపై దాడి జరిగిన విషయం తన తల్లికి తెలియకున్నా తల్లిని రాజకీయాల్లోకి లాగడం అంత దౌర్బాగ్యం వేరే లేదన్నారు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

Leave A Reply

Your email address will not be published.