రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నేతలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నేతలు శనివారం కలిశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వైఖరిని పార్లమెంటులో ఎండగట్టాలని, వర్గీకరణకు చట్టబద్దత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు విన్నవించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో వర్గీకరణపై ప్రశ్నిస్తామన్న రేవంత్ పార్టీ నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు.