మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్:  అధికార దాహంతో, ధన బలంతో, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి,తెరాస ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన బీజేపీ దుష్ట వైఖరిని నిరసిస్తూ నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని – నిజామాబాద్ ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన నసురుల్లాబాద్ మండల వైస్ ఎంపీపీ కొలిమి ప్రభాకర్ రెడ్డి, నసురుల్లాబాద్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండావార్ బాలకృష్ణ, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు వెంకటరమణ సొసైటీ చైర్మన్లు మారుతి పటేల్, సుధీర్ బాబు, ఎంపీటీసీ మండల ఫోరం అధ్యక్షులు కుమ్మరి నారాయణ, తెరాస పార్టీ సీనియర్ నాయకులు వంగ లక్ష్మీనారాయణ గౌడ్, చుంచు సాయిలు, సాయ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ ఇమ్రాన్, నవషాదుల్లా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.