తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయని రుతుపవనాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కు హైదరాబాద్ వాతావరణ కేంద్రం  గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని తెలిపింది. ఖమ్మం వరకు రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది. రాగల మూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని పేర్కొంది. 1, 2 రోజులు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.గత కొద్ది రోజులుగా తీవ్ర వడగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే కబురే వాతావరణ శాఖ అందించింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో హైదరాబాదీలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నదాతలు కూడా తొలకరి జల్లుల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. త్వరలోనే వారి ఎదురుచూపులకు ఫలితం దక్కేలా వాతావరణ శాఖ తీపి కబురే చెప్పింది. తాజా న్యూస్‌తో నాగలి పట్టేందుకు కర్షకులు సన్నద్ధమవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.