గణేష్ మండపాల వద్ద సందడి చేసిన సినీ తారలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే హైదరాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాల చివరి రోజు తెలుగు ప్రేక్షకుల అభిమాన టివి ఛానల్..జెమిని టివి నుండి,. జెమిని సీరియల్లో నటించే బుల్లితెర తారలు నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని.. అక్కడ నిర్వాహకులను.. భక్తులను కలిసి సందడి చేసారు.మహిళా ప్రేక్షకుల అభిమాన బుల్లితెర తారలంతా గణేష్ మండపాలకు విచ్చేసి అందరిని ఆనందంలో ముంచెత్తారు.ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో గణేష్ మండపాలలో దర్శించడం మాకు ఎంతో సంతోషం కలిగించిందని అని బుల్లితెర తారలు పేర్కొన్నారు.జెమినీ టీవీ గణేష్ ఉత్సవాలలో భాగంగా నేరెడ్మెట్లో వర సిద్ది వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు సీతారంనగర్ యూత్ & వెల్ఫేర్ అసోసియేషన్లో మీ అభిమాన సీరియల్ “అర్ధాంగి” ఫ్యామిలీ డ్రామా సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న ఈశ్వరి (దుర్గ) హీరో సుందరముర్తి ( లక్ష్మణ) మరియు ఆర్టిస్ట్స్ గా నటిస్తున్న గిరిజ (స్పందన) అభి (అలంక్రిత)గణేష్ మండపాలని బుదవారం సాయంత్రం నేరుగా గణేష్ మండపాలకు వచ్చి భాగస్వాములై విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.