పాదయాత్రగా గన్ పార్క్ కు బయలుదేరిన ఎంపీ బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి గన్ పార్క్ వద్దకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్రగా బయలుదేరారు. బండి సంజయ్ తోపాటు అడుగులో అడుగు వేస్తూ గన్ పార్క్ వైపుగా బయలుదేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు  యత్నిస్తుండగా అమరవీరులకు నివాళులు అర్పించేందుక పోలీస్ అనుమతి అవసరం లేదని  బండి సంజయ్ పేర్కొన్నారు.

గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించి తీరుతామని కరాఖండిగా తేల్చిచెబుతూ గన్ పార్క్ వైపుగా బయలుదేరిన బండి సంజయ్ పాదయాత్ర నాంపల్లి రైల్వే స్టేషన్ దాటింది.  మరికాసేపట్లో గన్ పార్క్ వద్దకు చేరుకోనున్న బండి సంజయ్,  పోలీస్ వలయాన్ని అడుగడుగునా చేధిస్తూ గన్ పార్క్ వైపుగా బయలుదేరిన బండి సంజయ్. బండి సంజయ్ సహా బీజేపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.

Leave A Reply

Your email address will not be published.