కృష్ణ మృతదేహం వద్ద నివాళులర్పించిన ఎంపీ బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలుగు చిత్ర సీమలో ఎంతో పేరు గడించిన సీనియర్ నటుడు దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందగా ఆయన పార్ధివ దేహం వద్ద తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. మహేష్ బాబుతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్ కుమార్ తోపాటు సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహానికి  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, సినీ నటి జీవిత తదితరులు నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.