కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్న ఎంపీ
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:
దీపావళి పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు,తన సిబ్బందితో కలిసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకుని,బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన లో రాష్ట్రంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని రవిచంద్ర భగవంతున్ని ప్రార్థించారు.ప్రతి ఇంటా వెలుగులు ప్రసరించాలని, మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయాలని వద్దిరాజు ఆకాంక్షించారు.