ఎంపీ కాన్వాయ్ ఢీ .. బాలుడు మృతి

.. భాజపా నేతపై కేసు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: యూపీలో ఘోరం జరిగింది. ఎంపీ కాన్వాయ్ ఢీకొట్టడం వల్ల ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భాజపా ఎంపీ కాన్వాయ్ కింద పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని బసియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రెండో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు.. స్థానిక ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. భాజపా ఎంపీ హరీశ్ ద్వివేది కాన్వాయ్ ఢీకొట్టింది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగిందని బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. “రోడ్డు దాటుతుండగా నా కొడుకును ఎంపీ కారు ఢీకొట్టింది. వెంటనే వాడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ప్రాథమిక చికిత్స అనంతరం లఖ్ నవ్వూ లోని మరో ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సిఫార్సు చేశారు. లఖ్నవ్వకు వెళ్తుండగా మధ్యలో కప్తాన్గంజ్ వద్ద ఆగాం. నా కుమారుడిని పరిశీలించాం. ఊపిరి తీసుకోవడం ఆగిపోయిందని అప్పుడు తెలిసిందని బాలుడి తండ్రి శత్రుఘన్ రాజ్భర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.