ప్రముఖ జర్నలిస్టు కంచర్ల మృతి పట్ల ఎంపీ వద్దిరాజు తీవ్ర సంతాపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి ( కె.ఎల్.రెడ్డి,92) మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వృద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన రెడ్డి జర్నలిస్టుగా పలు పత్రికలో పని చేశారని,నిరాడంబర జీవితాన్ని గడిపారని ఎంతోమంది కి ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచారని రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడిగా, పత్రికా రచయితగా సమాజానికి రెడ్డి నిస్వార్థంగా చేసిన సేవలను ఎంపీ వద్దిరాజు కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.