27న హైదరాబాద్ లో మిస్టర్ ఇండియా గ్రాండ్ ఫినాలే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 27న హైదరాబాద్ లో మిస్టర్ ఇండియా గ్రాండ్ ఫినాలే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మిస్సెస్ ఇండియా నేషనల్ ఇంటర్నేషనల్ 22 డైరెక్టర్ సుహాసిని పాండ్యం,జనరల్ మేనేజర్ సస్వతి,  లు తెలిపారు. ఈ మేరకు నేడు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావును  కలిసిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం జనరల్ మేనేజర్ సస్వతి మాట్లాడుతూ తాము మిస్ మిసెస్ ఇండియా,గ్లోబల్ బ్యుటి ట్రెజర్ కంపినీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా మొదటి ఈవెంట్ ను నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 27న నోవాటెల్ హోటల్ లో జరిగే గ్రాండ్ ఫినాలేకు దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.