బడుగు, బలహీన వర్గాల నాయకులు ములాయం సింగ్

టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ నాయకులు, సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్న బడుగు, బలహీన వర్గాల నాయకులు ములాయం సింగ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ఆయన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు, అదే విదంగా వారి మరణం భారత దేశంలో ఉన్నా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక నేతను కోల్పోవడం తీరని లోటు అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.