మే 31 న  కొమురవెల్లి లో మున్నూరు కాపుసత్రం భూమి పూజ మహోత్సవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 31 న కొమురవెల్లి లో మున్నూరు కాపుసత్రం భూమి పూజ మహోత్సవకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటు శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర భవనం వ్యవస్తాపక అద్యక్షులు ఉప్పు రవీందర్ పటేల్ తెలిపారు.ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని బిసి భవన్ లో మున్నూరు కాపుసత్రం భూమి పూజ వాల్ పోస్టర్ ను రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య,ఎర్ర సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఈ మహా కార్యానికి రావసిన్డిగా ఆర్ కృష్ణయ్య ఆహ్వానించారు అనంతరం ఉప్పు రవీందర్ పటేల్ మాట్లాడుతూ కాశీ పీఠం పీఠాతీస్వర్లు పరమహంస పరి వజ్రకాచార్య  శ్రీ శ్రీ శ్రీ శివ నాగేంద్ర సరస్వతి స్వామీజీ మహాస్వామిజీ చేతుల మీదుగా ఈ భూమి పూజా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి  మున్నూరు కాపు కుల బంధువులను ప్రతి ఒక్కరిని కలిసి ఆహ్వానించడం జరిగినదని తెలిపారు.  ఈ కార్యక్రమం లో ఆకుల.రాజయ్య పటేల్,  మొగిలి దుర్గ ప్రసాద్ పటేల్, గూడెపు  ప్రవీణ్ పటేల్, ఎడ్ల సురేందర్ పటేల్, మారిశెట్టి మురళి పటేల్,స్వామి వివేక్ పటేల్ కాముని రమేష్ పటేల్, మురళి పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.