ఎమ్మెల్సీ ని పరామర్శించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కంగ్టి ప్రతినిధి: కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్ రమణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని యశోద ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్ రెడ్డి మంగళవారం ఆస్పత్రికి చేరుకొని రమణ ను పరామర్శించడంతో పాటు ఆయన  గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ, వారి సలహాలు పాటించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.