పెళ్లి చేసుకున్న న‌రేష్, ప‌విత్రా లోకేష్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టాలీవుడ్‌కి చెందిన సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్‌, న‌టి ప‌విత్రా లోకేష్ పెళ్లి జ‌రిగింది. సన్నిహితులు, ప‌రిమిత‌మైన కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి వేడుక పూర్త‌య్యింది. ఈవేడుక‌కి సంబంధించిన వీడియోను నరేష్ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఇప్పుడు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. వీడియో పాటు ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు .. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాం అనే మెసేజ్‌ను నరేష్ పోస్ట్ చేశారు. దీంతో వారిద్దరూ తాము వివాహ బంధంలోకి అడుగు పెట్టినట్లు అధికారంగా ప్రకటించినట్లయ్యింది. న‌రేష్ నాలుగో పెళ్లి ఇది. ప‌విత్రా లోకేష్‌కి ఇది రెండో పెళ్లి. నూత‌న సంవత్స్రంలో తామిద్ద‌రం పెళ్లి చేసుకుని ఒక‌టి కాబోతున్న‌ట్లు న‌రేష్, ప‌విత్రా లోకేష్ ఇది వ‌ర‌కే నూతన సంవత్సరం సందర్భంగా ఓ వీడియో ద్వారా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. చెప్పిన‌ట్లే వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు. కొన్నాళ్లుగా న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ పెళ్లి చేసుకుంటార‌నే దానిపై నెట్టింట వార్త‌లు వచ్చాయి .. దానిపై ఇటు నరేష్, అటు పవిత్రా లోకేష్ కాదనలేదు. తామిద్దరం రిలేషన్ షిప్‌‌లో ఉన్నామనే తెలిపారు. దీనిపై వివాదం కూడా కొన‌సాగుతుంది. న‌రేష్ మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ పెళ్లిపై గొడ‌వ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కర్ణాటకలో రమ్యా రఘుపతి నరేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చింది. అప్పుడు ఆయన పవిత్రా లోకేష్‌తో కలిసి మైసూర్ వెళ్లారు. అక్కడ వారిద్దరి ఓ రూమ్‌లో పట్టుకున్నానంటూ రమ్యా రఘుపతి గొడవ చేయటం.తాము రిలేషన్‌లో ఉన్నామని తప్పేంటని నరేష్ అనటం.. తర్వాత జరిగిన పరిణామాలు.. ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు అందరికీ తెలిసినవే. మరిప్పుడు రమ్యా రఘుపతికి నరేష్ విడాకులు ఇచ్చారా? ఇవ్వకుండానే వివాహం చేసుకున్నారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.