మహిళా సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం
- ఐపిసి మహిళా కార్యాలయంలో శివలెంక నాగ ఉదయలక్ష్మి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ ప్రజా కాంగ్రెస్ మహిళా కార్యకర్తల సమావేశం శ్రీ రామలింగేశ్వర దివ్యాంగుల కాలనీ కీసర మండలంలో ఇండియా ప్రజా కాంగ్రెస్ మహిళా కార్యాలయంలో శివలెంక నాగ ఉదయలక్ష్మి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ జాతీయ కార్యనిర్వాక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉదయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో మహిళ సమస్యలపై చట్టాలపై అవగాహన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరిచి సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారం విషయం లో ఎన్ని ప్రభుత్వాలు వచ్చిచట్టాలు చేసినా అవి ఆచరణ నోచుకోలేదని ప్రభుత్వాలపై ఆమె విమర్శించారు. తెలుగు రాష్ట్రంలోనూ జాతీయస్థాయిలోనూ మహిళా సాధికారికత కోసం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ నూతన దృక్పథంతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనగా జరుపాలని సమావేశం లో నిర్ణయించినట్లు తెలిపారు. మహిళా సమస్యల విషయంలోఅన్ని నియోజకర్గాల్లోనూఅవగాహన సదస్సులుఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం కి మహిళా నాయకులు శారద, అరుణ,టీ సమత, కార్టూన్ మమత మహాలక్ష్మి శారద తదితరులు పాల్గొన్నారు.