సంగారెడ్డి జిల్లాలో బిజెపి నూతన కార్యాలయం ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా బిజెపి నూతన కార్యాలయం ప్రారంభించడానికి శుక్రవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు& పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు , పార్లమెంట్ సభ్యులు డా.కె.లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ జీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి& బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ జీ, బిజెపి జాతీయ కార్యదర్శి, బిజెపి తెలంగాణ రాష్ట్ర సహా ఇంచార్జీ అరవింద్ మీనన్ జీ లు మధ్యాహ్నం 2:30 గంటలకు నూతన కార్యాలయం ప్రారంభించి సభలో ప్రసంగిస్తారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా వర్చవల్ గా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.