దసరా తర్వాతే రేషన్ బియ్యం
నిజామాబాద్ జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా తర్వాత బియ్యం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ఒక్కో లబ్దిదారుడికి ఐదు కిలోల చొప్పున ఇవ్వనున్నారు. అయితే ‘కేంద్రం మరో మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తామన్నా.. అదనంగా ఐదు కిలోల బియ్యంపై అధికారిక ఉత్తర్వులు రావాలని’ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్ తెలిపారు.