కరీంనగర్‌ పట్టణంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాల కలకలం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కరీంనగర్‌ పట్టణంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా చెందిన ఓ కీలక నేత ఇంట్లో గురువారం ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో ఎన్ఐఏతోపాటు, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు.ఉదయం నుంచి సుమారు ఐదు గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఆ ఇంట్లో లేరని తెలుస్తున్నది. విదేశాల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. హుస్సేనీపురతోపాటు కార్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలోని పలు ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.