భారతీయ శ్రామిక కళ్యాణ్ సంఘ్ నూతన అధ్యక్షులు గా నీలేష్ గుప్తా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ శ్రామిక కళ్యాణ్ సంఘ్ నూతన అధ్యక్షులు గా నీలేష్ గుప్తా నియమితులైనారు. భారతీయ శ్రామిక కళ్యాణ్ సంగానికి ఘజీయబాద్ జిల్లా ఆదర్శ నగర్ కు చెందిన నీలేష్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయినాట్లు రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర కుమార్ పాఠక్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ శ్రామిక కళ్యాణ్ సంఘ్ లోని ప్రతి ఒక కార్మిక కుటుంబ శ్రేయ్యస్సు తమ ధ్యేయం అని అన్నారు. అనంతరం నూతన అధ్యక్షులు నీలేష్ గుప్తా మాట్లాడుతూ తనపై నమ్మకం తో తనకు ఈ పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు తిలిపారు. తన పై ఉంచి న నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు.