ప్రదాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డ నితీశ్ కుమార్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రదాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. న్యూ ఇండియాలో నూతన జాతిపిత ఏం ఉద్ధరించారని ఫైరయ్యారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. నూతన భారత దేశానికి కొత్త జాతిపిత ప్రధాని మోదీ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు.దేశ స్వాతంత్య్రం కోసం బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ వారి పాత్ర ఏమీ లేదన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్రను మనం మర్చిపోగలమా? అని ప్రశ్నించారు. ‘కొత్త దేశానికి కొత్త జాతిపిత’ దేశానికి మీరేం చేశారని నిలదీశారు. చెప్పుకోదగినదేమైనా చేశారా అని వ్యాఖ్యానించారా. బీజేపీ పాలనలో కొత్త టెక్నాలజీ అభివృద్ధి అయింది అంతే అని విమర్శించారు. దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రతిపక్షాల వ్యాఖ్యలు ప్రసారమవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.గత నెల 21న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమృతా ఫడ్నవీస్.. ఈ దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారు. గత కాలపు భారత దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అయితే, నూతన భారత దేశానికి జాతిపిత నరేంద్ర మోదీ అన్న అన్నారు.