ఫ్రెషర్స్ కు నో జాబ్.. షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీలు

మాంద్యం ముప్పు ముంచుకొస్తోందని.. ఐటీ కంపెనీలన్నీ పొదుపుబాట పడుతున్నాయి. ఉద్యోగంలో చేరేందుకు ఆఫర్ లెటర్లు చేతిలో పట్టుకున్న ఫ్రెషర్లకు ఐటీ కంపెనీలు షాకిస్తున్నాయి. అన్ని రౌండ్లు పూర్తి చేసుకున్న వారి ఆఫర్ లెటర్లను విప్రో ఇన్ఫోసిస్ టెక్ మహీంద్ర కంపెనీలు రద్దు చేయడం సంచలనమైంది. నివేదికల ప్రకారం వందలాది మంది ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇవ్వబడ్డాయి. అయితే మొదట ఆ అభ్యర్థుల చేరికను వాయిదా వేశారు. చివరకు తాజాగా వారి ఆఫర్ లెటర్ను రద్దు చేశారు.విప్రో ఇన్ఫోసిస్ మరియు టెక్ మహీంద్రా వంటి అగ్రశ్రేణి ఐటీ మరియు టెక్ సంస్థలు దాదాపు మూడు-నాలుగు నెలల పాటు విద్యార్థులను కంపెనీలో  చేర్చుకోవడానికి ఆలస్యం చేసిన తర్వాత వారికి ఇచ్చిన ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకున్నాయి. ఆఫర్ లెటర్లు తిరస్కరించబడిన ఫ్రెషర్లకు ఈ కంపెనీలు పంపిన ఇమెయిల్లు చూసి వారంతా షాక్ అయిన పరిస్థితి నెలకొంది.నివేదికల ప్రకారం విద్యార్థులు అనేక రౌండ్ల ఇంటర్వ్యూలు.. కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత ఈ ఆఫర్ లెటర్లను అందుకున్నారు. “మీరు మా విద్యా అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేరని గుర్తించబడింది. అందువల్ల మీ జాబ్ ఆఫర్ ను తిరస్కరిస్తున్నాం ” అని ఇమెయిల్లలో రాశారు.ఈ నివేదికలపై కంపెనీలు ఇంకా స్పందించలేదు. కానీ దీనికి కారణం మార్కెట్లో మనీ ఫ్లో కఠినంగా మారడం.. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండడం వంటి ప్రతికూల పరిస్థితులతో కంపెనీలు ఇలా చేస్తున్నాయని అర్థమవుతోంది. ఇలా అయితే ఎలా అని ఎంపికైన విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు మాంద్యం భయాలు మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య భారతీయ పరిశ్రమలను దెబ్బతీశాయి. దేశంలోని ఐటీ/టెక్ పరిశ్రమ కూడా దీనికి అతీతం కాదని రుజువైంది.రానున్న కాలంలో భారత ఐటీ పరిశ్రమ జోరు మరింత తగ్గుతుందని నిపుణులు ముందే చెప్పారు. టీసీఎస్ ఇంతకుముందు తన ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని వాయిదా వేసింది. అయితే ఇన్ఫోసిస్ దానిని 70 శాతానికి తగ్గించింది. విప్రో దానిని పూర్తిగా వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.