ఇకపై వాట్సాప్ లో నూ ఆర్టిసి టికెట్లు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇప్పుడు టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. అంతా డిజిటల్ మయం అయిపోతోంది. ఏదైనా ఆన్‌లైన్‌లోనే దొరికే విధంగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మనం మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి ఇతర సేవలు, పరిష్కారాలు సహా ఎక్కడికైనా వెళ్లాలన్నా.. క్యాబ్, ట్రైన్ ఇలా ఏదైనా టికెట్లు బుక్ చేసుకోవాలంటే వాట్సప్‌లో కూడా ఆప్షన్లు ఉంటున్నాయి. ‌ఇప్పటికే హైదరాబాద్ మెట్రో టికెట్లు కూడా వాట్సప్‌లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిని ఇతర రవాణా మార్గాలకు కూడా విస్తరించే దిశగా ఆలోచిస్తోంది మెటా. త్వరలోనే టీజీఎస్ఆర్టీసీ టికెట్స్ కూడా వాట్సప్ ద్వారా విక్రయించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత విషయం వెల్లడించారు మెటా బిజినెస్ మెసేజింగ్ ఇండియా డైరెక్టర్ రవి గార్గ్.ఏఐ ఏజెంట్..ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (MSME) సంస్థలతో పాటుగా.. చిరు వ్యాపారులు కూడా తమ వ్యాపారాల్ని ఆన్‌లైన్‌లో విస్తరించే దిశగా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత సాంకేతికత ఏఐ ఏజెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం మెటాకు చెందిన వాట్సప్ పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా ఇది వాడుకలోకి వస్తుందని తెలిపింది.పెద్ద పెద్ద సంస్థలు సొంతంగా యాప్స్, కృత్రిమ చాట్‌బాట్స్ నిర్వహిస్తాయి కానీ MSME లకు మాత్రం ఆర్థిక వనరులు అంతంతమాత్రంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వాట్సప్ స్మాల్ బిజినెస్ యాప్ తెచ్చినట్లు రవి గార్గ్ తెలిపారు. వాట్సప్ ప్లాట్‌ఫాం ద్వారా బిజినెస్ టు కన్జూమర్ (B2C) ట్రాన్సాక్షన్స్ సులభతరం చేసేందుకు ఏఐ ఏజెంట్ తోడ్పడుతుందని తెలిపారు.కస్టమర్ల, వ్యాపార సంస్థల్ని సంప్రదించినప్పుడు.. అవసరమైన సమాచారం ఇది అందిస్తుందని.. కొనుగోలు ఆర్డర్ పూర్తి చేసేందుకు కూడా ఇది తోడ్పడుతుందన్నారు. దీనితో సహా ఏఐ అసిస్టెంట్‌ను కూడా తీసుకొస్తున్నట్లు.. వ్యాపారులు తమ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌కు సంబంధించినటువంటి ప్రకటనల్ని రూపొందించడం సహా వారికి ఇతర అంశాల్లోనూ ఇది సహాయం చేస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.