ఆంగ్లో-ఇండియన్ల మాదిరిగా అత్యంత వెనుకబడిన కులకు నామినేటెడ్ పోస్ట్లు ఇవ్వాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అత్యంత వెనుకబడిన కులాలు ఇంతవరకు అసెంబ్లీ , పార్లమెంట్ గడప తొక్కలేదని అలాంటి కులాలకు ఆంగ్లో-ఇండియన్ల మాదిరిగా నామినేటెడ్ యం.యల్.ఏ/యం.పి లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగుడాల సుదాకర్ ముదిరాజ్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.బుదవారం బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఈ దేశంలో పుట్టిన అత్యంత వెనుకబడిన కులాలు ఇందుకు అర్హులు కాదా అని ప్రశ్నించారు.పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు.పార్లమెంట్ లో బి.సి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బి.సి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలని కోరారు.రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభలలో 50 శాతం సీట్లు అదనంగా పెంచి అత్యంత వెనుకబడిన కులాలకు నామినేటెడ్ పద్దతిలో ఈ సీట్లు ఇవ్వాలన్నారు.విదేశీయులైన ఆంగ్లో-ఇండియన్లకు నామినేటెడ్ యం.యల్.ఏ లుగా, యం.పి లుగా ఇస్తున్నారు.బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలన్నారు.బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని,ఎస్సీ/ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి యాక్టును తీసుకరావాలని సుదాకర్ మూడు రాజ్ డిమాండ్ చేసారు.ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్ధిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలన్నారు.