రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  రాష్ట్రంలో మెడిక‌ల్ విద్య పూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఈ నెల 20న ఉద‌యం 10:30 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 5వ తేదీన సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 18 నుంచి 44 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అన‌స్థీషియాలో 155, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.