నవంబర్ ౩ ల సెలవు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. పోలింగ్ రోజున సెలవు ప్రకటించేందుకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు అనుమతినిచ్చింది. పోలింగ్ కేంద్రాలు ఉన్న కార్యాలయాలు, సంస్థలకు పోలింగ్ ముందు రోజు కూడా సెలవు ఇవ్వాలని, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసే కార్యాలయానికి లెక్కింపు రోజున కూడా సెలవు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చింది.