నర్సింగ్ కాలేజీ బస్సు బోల్తా

- విద్యార్థులకు గాయాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ కాలేజీ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాలేజీ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది నర్సింగ్ విద్యార్థులు ఉన్నారు. వారిలో 30 మందికి గాయాలు కాగా.. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందుస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన నర్సింగ్ విద్యార్థులను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సూర్యాపేటకు చెందిన భవాని స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి ఉదయం కాలేజీ బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో నకిరేకల్ మండలం తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుక నుంచి స్పీడ్‌గా వచ్చిన లారీ కాలేజీ బస్సును ఢీ కొట్టింది. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.