క‌డుపులో న‌ట్లు, బోల్టులు, వైర్లు..స‌ర్జ‌రీ చేసి తీసిన డాక్ట‌ర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తీవ్ర‌మైన జ్వ‌రంక‌డుపు నొప్పితో 40 ఏళ్ల వ్య‌క్తి హాస్పిట‌ల్‌కు వెళ్లాడు. నొప్పి ఎక్కువ‌గా ఉంద‌న‌డంతో.. అత‌నికి ఎక్స్ రే తీశారు. ఆ రిపోర్టు చూసిన డాక్ట‌ర్లు ఖంగుతిన్నారు. రెండేళ్ల నుంచి క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి క‌డుపులోంచి విచిత్ర‌మైన వ‌స్తువుల్ని డాక్ట‌ర్లు స‌ర్జ‌రీ చేసి తీశారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని మోగాలో జ‌రిగింది. ఆ న‌గ‌రంలో ఉన్న మెడిసిటీ హాస్పిట‌ల్‌లో అత‌నికి చికిత్స చేశారు.. ఆ వ్య‌క్తి క‌డుపులో ఉన్న వ‌స్తువుల్ని చూసి షాక్ అయ్యారు. ఆ పేటెంట్ క‌డుపులో అన్నీ మెట‌ల్ వ‌స్తువులు ఉన్న‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. సుమారు మూడు గంట‌ల పాటు శ‌స్త్ర‌చికిత్స చేసి అత‌ని క‌డుపు నుంచి ఆ ఐట‌మ్స్ తీశారు.ఆ పేషెంట్ క‌డుపులో ఇయ‌ర్‌ఫోన్స్‌వాష‌ర్స్‌న‌ట్స్‌బోల్టులువైర్లురాఖీలులాకెట్స్‌బ‌ట‌న్స్‌వ్రాప‌ర్స్హెయిర్‌క్లిప్‌లుజిప్ప‌ర్ ట్యాగ్‌సెఫ్టీ ఫిన్‌లు ఉన్న‌ట్లు గుర్తించారు. ఇలాంటి కేసును ఆప‌రేట్ చేయ‌డం ఇదే తొలిసారి అని డాక్ట‌ర్ అజ్మీర్ క‌ల్రా తెలిపారు. ఆ పేషెంట్ శ‌రీరం నుంచి అన్ని వ‌స్తువుల్ని తీసివేసినా.. అత‌ని ఆరోగ్యం నిల‌క‌డ‌గా లేద‌న్నారు. ఖ‌నిజ వ‌స్తువులు చాన్నాళ్ల నుంచి అత‌ని క‌డుపులో ఉన్న కార‌ణంగా.. అత‌ని ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డిందని డాక్టర్లు తెలిపారు. ఆ వ్య‌క్తి ఎందుకు ఆ వ‌స్తువుల్ని మింగాడో అర్థం కావ‌డం లేద‌ని ఫ్యామిలీ స‌భ్యులు తెలిపారు. అయితే అత‌ను గ‌త కొన్నాళ్ల నుంచి మాన‌సిక‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.