అక్టోబర్ 2 న లోక్ సత్తా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం

లోక్ సత్తా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 అక్టోబర్ ఆదివారం రోజున మల్కాజిగిరిలోని పద్మావతి ఫoక్షన్ హాల్ లో ఉదయం 10.00గం.లకు వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ తెలిపారు.ఈ మేరకు పార్టీ కార్యాలయం లో ఆవిర్భావ దినోత్సవం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఈ కార్యక్రమానికి వ్యవస్థాపకులు డా.జయప్రకాష్ నారాయణ, విజిఆర్.నారగోని,డా.రాం నర్సయ్య. యం.సూర్య నారాయణ, గన్ రెడ్డి రాజారెడ్డి, కటారి శ్రీనివాస రావు తదితరులు  అథితులుగా పాల్గొంటారని తిలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రక్మం లో కిషోర్, వంశీ, గణేష్, శివరామ కృష్ణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.