కృష్ణాజిల్లాలో దంపతులను బలిగొన్న పాత కక్షలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రూపాయి రూపాయి నువ్వేం చేస్తావనడిగితే.. హరిశ్చంద్రుని చేత అబద్ధమాడిస్తాను. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను. తండ్రీబిడ్డల్ని విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరికి ప్రాణ స్నేహితుల్ని కూడా విడగొడతాను అందట.. డబ్బు, ఆస్తి అనేవి బంధాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చెప్పే సినిమా డైలాగ్ ఇది. అచ్చం ఇలాటి ఘటనలే ప్రస్తుత సమాజంలో చోటుచేసుకుంటున్నాయి. ఆస్తి కోసం సొంత వారే విడిపోవడం, గొడవలు పెట్టుకోవడం, చంపుకోవడం చేస్తున్నారు. డబ్బు ముందు సొంత తండ్రి, తోడబుట్టిన వారు కూడా తక్కువే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాటి సంఘటనే కృష్ణ జిల్లా పామర్రు నియోజకవర్గంలోని అయ్యంకి గ్రామంలో చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా పామర్రు నియోజకవర్గం అయ్యంకిలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. అయ్యంకి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3 ఎలరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీర కృష్ణ హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.