ఈనెల 21న ఆంధ్ర ప్రదేశ్ బిఆర్ ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డా.తోట చంద్రశేఖర్ చేతులు మీదుగా ఈ నెల *21-05-2023 అనగా ఆదివారం ఉదయం 11:35 ని!!లకు* అంగరంగ వైభవంగా పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఆహ్వానితులే! అందరూ కలిసి కట్టుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా తోట చంద్రశేఖర్ కోరారు. ఏఎస్ ఫంక్షన్ హాల్ పక్కన
మహీంద్రా షో రూం ఎదురు రోడ్డు మంగళగిరి రోడ్డు
గుంటూరు – 1 లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని. హాజరైన అతిథులకు మద్యాహ్నం 12గం నుండి విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.