ఈ నెల 31న ఎమ్మార్పీఎస్ ఆద్వర్యం లో మహనీయుల జయంతి ఉత్సవాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 31న జాతీయస్థాయి మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సగ్గు శివకుమార్ తెలిపారు. ఈ మేరకు బీసీ భవన్ లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణకు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా సగ్గు శివకుమార్  మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయులను జాతి మరచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో జాతీయ మహనీయులను గుర్తు చేస్తూ వారిని స్మరించుకునేందుకు ఈ మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు, రాజ్య సభ సబ్యులు ఆర్.కృష్ణయ్య  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బిజెపి నేత ఈటెల రాజేందర్, వైయస్సార్ పీఎస్ అధ్యక్షురాలు షర్మిల తదితరులు హాజరత్నట్లు ఆయన తెలిపారు

Leave A Reply

Your email address will not be published.