మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేరు..అరెస్ట్ తప్పదా..?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరొకరిని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో అవకతవకలపై ఇటీవల రెండు రోజులపాటు రామచంద్ర పిళ్ళైని ఈడీ ప్రశ్నించింది. అదుపులోకి తీసుకున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఈడీ వర్గాలు వెల్లడించాయి. అరుణ్ పిళ్ళై‌కి చెందిన వట్టినాగులాపల్లిలో రూ .2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రామచంద్ర పిళ్లైతో కలిపి ఇప్పటి వరకూ 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైను ఢిల్లీ మద్యంకుంభకోణంలో నిందితుడిగా పేర్కొంది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లుకార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఉంది. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టైన వారిలో ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. అరుణ్ పిళ్ళై.. ఈ స్కామ్‌లో అభిషేక్ బోయిన్‌పల్లిసమీర్ మహేంద్రూవిజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తోంది. కాగా.. ఈ వరుస అరెస్ట్‌ ల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేరు తెరపైకి వచ్చింది. తదుపరి అరెస్ట్ ఆమెనంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అరెస్టైన విషయం తెలిసిందే. ఇక ముందు కూడా మరిన్ని అరెస్ట్‌ లు ఉండే అవకాశముందని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.