ఒకసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి రాష్ట్ర సంపద దోచుకుంటున్నారు

* నవరత్నాలు పంచి ప్రజలు ఓట్లు కొల్లగొడదామని చూస్తున్నారు * అమరావతి నుంచి రాజధాని మార్చడం జగన్ దోపిడి కోసమే * పార్టీ అధినేత ఏవిధంగా నిర్దేశిస్తే ఆ విధంగా నడుచుకుంటా * జగన్ మోహన్ రెడ్డి పై కన్నాలక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసీపీ అధినేతముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై కన్నాలక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి దేశంలో అత్యంత ధనిక సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి రాష్ట్ర సంపద దోచుకుంటున్నారని ఆరోపించారు. నవరత్నాలు పంచి ప్రజలు ఓట్లు కొల్లగొడదామని చూస్తున్నారన్నారు. అమరావతి నుంచి రాజధాని మార్చడం జగన్ దోపిడి కోసమే అని అన్నారు. అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. ఏపీ ని బీహార్ కంటే అధ్వాన్నంగా తయారు చేస్తున్నారని విమర్శించారు. జగన్ వచ్చిన మరుక్షణం నుంచి ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. వైసీపీ అరాచకాలకు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం ఉంటే ఎందుకు ప్రతిపక్షాలను చూసి భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా పోలీసులు ప్రజలకు సేవచేయాలని లేకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. మోదీ నాయకత్వం బాగున్నా ఏపీ బీజేపీ నాయకత్వం సరిగా లేదని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.కాగా బీజేపీ కి రాజీనామా చేసిన ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణఈనెల 23న టీడీపీ లో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కన్నా పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో తన స్థానం ఏమిటనే విషయంపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… కన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశంలో తన పాత్ర ఏమిటో పార్టీ తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పార్టీ అధినేత ఏవిధంగా నిర్దేశిస్తే ఆ విధంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.