వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ‘ అందరికి వర్తింప జేయాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సైన్యం లో ప్రవేశ పెట్టిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ‘ 2టేబుల్ ను రక్షామంత్రాలయం 20.1.2023.లోజారీ చేశారు.అందులో సిపాయి,నాయక్,హవల్దార్ స్థాయి రాంకులకు మిలిటరీ సర్వీస్ పే అధికారులకు చాలావ్యత్యాసం వున్నది.వారికి పెంచిన విధంగా ఇతర రాంకులకు అదే పెరుగుదల వర్తింప చేయాలని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వుజ్జని రవీందర్ రావుమరియు యాదాద్రి భువనగిరి అధ్యక్షులు దొంతరబోయిన దైవాధీనం కోరారు. ఈ మేరకు రక్షా మంత్రాలయాన్ని అభ్యర్థిస్తూ రాజ్యసభలో ప్రజెంటు చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్. క్రిష్ణయ్యను కలిసి వినతి పత్రం సమర్పించారు.