టిఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది వైపే ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బి ఎస్ పి కి చెందిన యువకులు బుదవారం గులాబీ కండువా కప్పుకున్నారు. మునుగోడు లో టిఆర్ఎస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై,కేసిఆర్ చేస్తున్న అభివృద్ది వైపే ఉంటామని పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే బీజేపీ వైఖరి యువతకు అర్థమవుతోందని చెప్పారు. ఈ సందర్బంగా చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామం 8వ వార్డు నుంచి బిఎస్పీకి చెందిన నాయకులు వెంకటేష్,మల్లేష్,ఏచూరి గిరి,నాగరాజు,ఏచూరి అనిల్,వినోద్ పలువురు యువకులు మంత్రి సమక్షంలో టీఎర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని వారికి మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, వేం యుగంధర్ రెడ్డి, వేం దేవేందర్ రెడ్డి,సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.