తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో యుబిఐ బ్రాంచి ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ సముదాయం ప్రాగంణంలో ఏర్పాటు  చేసిన నూతన  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్రాంచి ని  ఈరోజు   ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాస్కర్ రావు, రీజినల్ హెడ్ కె శ్రీధర్ బాబు,  బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వి విజయ్ కుమార్ పాల్గొన్నారు.సచివాలయం ఉద్యోగులకు బ్యాంక్ ఉత్తమ సేవలు అందించేందుకు  బ్యాంక్ అధికారులు కృషి చేయాలని  సి ఎస్  కోరారు.  బ్యాంక్ అధికారులతో కలసి సి.ఎస్  స్ట్రాంగ్ రూమ్ , కంప్యూటర్ సెంటర్ ను పరిశీలించారు. ప్రస్తుతం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో   సేవలు అందిస్తున్న బ్యాంకు బ్రాంచి  ఈ రోజు నుండి  నూతన కార్యాలయం ద్వారా సేవలు కొనసాగిస్తుందని  బ్యాంక్  చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు. బ్యాంక్ అధికారులు, సిబ్బందికి  సిఎస్ శుభాకాంక్షలు  తెలిపారు.  ఈ  కార్యక్రమంలో బ్యాంక్  మేనేజర్ అనూష,   ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.