రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది డీఎస్పీలకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ పోలీసు శాఖలో పోస్టింగ్లు, బదిలీలు కొనసాగుతున్న విషయం విదితమే. తాజాగా డీఎస్పీలకు పోస్టింగ్లు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది డీఎస్పీలకు పోలింగ్లు ఇస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కుల్సుంపుర ఏసీపీగా అబ్దుల్ జావిద్, మీర్ చైక్ ఏసీపీగా ఉమా మహేశ్వర్ రావు, వర్ధన్నపేట ఏసీపీగా వీ సురేశ్, వరంగల్ సీసీఆర్బీ ఏసీపీగా గజ్జి కృష్ణ, టీఎస్ జెన్కో ఏసీపీగా తిరుపతి యాదవ్, సీసీఎస్ ఏసీపీగా శంకర్ రెడ్డిని నియమించారు.