ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఈ పనులను గతేడాది మార్చిలో పూర్తి చేయగా.. బిల్లులను చెక్కు రూపేణా సువర్ణకు పంచాయతీ కార్యదర్శి పాండురంగం అందజేశారు. కాగాబిల్లులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి డిమాండ్‌ చేశాడు.ఈ క్రమంలో సువర్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాండురంగానికి సువర్ణ రూ.9వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని విచారణ చేపట్టారు. పాండురంగంను మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ బి.శ్రీకృష్ణాగౌడ్‌ఇన్‌స్పెక్టర్లు లింగస్వామిఏఎస్‌కే జిలానీఅధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.