స్టాండింగ్ కమిటీ సభ్యులగా కృష్ణయ్య నియామకం పట్ల పండరి బాయి హర్షం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారిని కేంద్ర ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించినశుభ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి క్షత్రి పండరి బాయి హార్దిక శుభాభినందనలు తెలిపారు.భగవంతుని ఆశీస్సులతో అంచలంచాలుగా కృష్ణయ్య మరింత ముందుకు వెళుతూ మునుముందు మరెన్నో అత్యున్నత పదవులను అధిరోహించాలని పండరి బాయి ఆకాంక్షిచారు.రాజ్య సభ సభ్యునిగా ఎగువ సభలు తన గళాన్ని విప్పి బిసిలకు రాజ్యాధికారం దిశలో పయనించాలని ఆమె భగవంతున్ని ప్రాదిస్తున్నట్లు తెలిపారు.పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టాలని,జనాబా ప్రాతిపదికన బిసి రిజర్వేషన్స్ పెట్టాలని, బిసి జనగణన చేపట్టాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని పండరి బాయి డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.