బోర్లం పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలం లోని బోర్లం ప్రాథమిక పాఠశాలలో  శుక్రవారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ మెంబర్లు మరియు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని, మా పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యలో ముందుండి, విద్యార్థులు బాగా చదువుకుంటున్నారని, ఉపాధ్యాయులకు మరియు పాఠశాలకు ఏ నాయకులైన కావాలని అడ్డంకులు సృష్టిస్తే మర్యాదగా ఉండదని, ఉపాధ్యాయుల కోసం మేము ఎక్కడికైనా రావడానికి, ఏదైనా చేయడానికి వెనకాడబోమని, మేము ఎప్పుడు పాఠశాల ఉపాధ్యాయులతోనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో SMC కమిటీ మెంబర్లు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.