దామరంచ పాఠశాలలో పేరెంట్స్ సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ బీర్కూర్ : బీర్కూరు మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో శనివారం పేరెంట్స్ సమావేశాన్ని ఎస్ఎంసి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఇతర సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని కోరారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే గ్రామస్తుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ విట్టల్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎస్ఎంసి చైర్మన్ మోహన్, ప్రిన్సిపల్ నిర్మల, ఉపాధ్యాయులు విట్టల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.