కొండగట్టుకు పవన్ కళ్యాణ్

- వారాహీ కి ప్రత్యేక పూజలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ కాన్వాయ్‌తో కొండగట్టుకు పయనమయ్యారు. కాసేపట్లో ఆయన కొండగట్టుకు చేరుకోనున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఆయన కొండగట్టుకు వస్తున్నారు. ప్రచార వాహనానికి అంజనేయ స్వామి చెంత ప్రత్యేక పూజలు చేస్తారు. .

ఈ ఉదయం హైదరాబాద్‌లోని ఇంటి నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్ మరికాసేపట్లో జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకోనున్నారు.  ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు భారీగా అక్కడకు చేరుకున్నారు. పవన్ తన సొంత వాహనంలో వస్తే వెనుకాల వారాహి బయల్దేరింది. పార్టీ ప్రచార రథం వారాహికి ఆంజనేయస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు పవన్ కల్యాణ్‌. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు చేయిస్తారు. అనంతరం ప్రచార రథంపై యాత్రకు బయల్దేరనున్నారు  పవన్ కల్యాణ్.

ఈ పూజల అనంతరం పవన్ కల్యాణ్‌… నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టుకు వస్తారు. అక్కడ జనసేన తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అక్కడే లంచ్‌ కూడా పవన్ చేయనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు… ప్రజలకు అండగా ఉండాల్సిన అంశాలపై కార్యకర్తలకు, పార్టీ లీడర్లకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.