ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కెసిఆర్ మరోసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరుతున్నాడన్నారు. ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేశారు. కెసిఆర్ ఎం తీసుకొచ్చారని దశాబ్ది ఉత్సవాలు జరుపుతారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చావా , దళిత ముఖ్యమంత్రి ఇచ్చావా , నిరుద్యోగ భృతి,రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చావా కెసిఆర్  ప్రశ్నించారు. కాళేశ్వరం పోజెక్ట్స్ లో అవినీతి ఇలా అన్నింటిలోనూ అవినీతే కర్ణాటకలో 40 శాతం కమిషన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలో 500 శాతం ఆవినీతే .. ఇక్కడి ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెపుతారు. గిరిజన యూనివర్సిటీ తీసుకురాలేకపోయావు కెసిఆర్ పోడు భూములకు పట్టాలివ్వలేదు ప్రజల్ని డైవర్ట్ చేయడానికే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. గిరిజనులకి , మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచినందుకు దశాబ్ది ఉత్సవాల అని ప్రశ్నించారు. కర్ణాటకలో మంత్రులు ఏవిధంగా ఓడిపోయారో ఇక్కడ కూడ అదేవిధంగా ఓడిపోతారు దశాబ్ది ఉత్సవాలని బహిష్కరించాలి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.