రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత సాయాన్ని ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోదీ బదిలీ చేయనున్నారు. ఈ పథకం కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో.. రూ.2వేలు చొప్పున) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోదీ సంతకం చేశారు.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను ఏటా మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ – జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది

Leave A Reply

Your email address will not be published.