యూత్ నాయకులతో సమావేశమైన పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు నియోజక వర్గం ఉపఎన్నికల్లో భాగంగా ఈరోజు మందేలగూడెం చిన్నకొండుర్ గ్రామాల తెరాస పార్టీ మరియు సీపీఎం పార్టీ యూత్ నాయకులతో ఇంఛార్జి, నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజక వర్గానికీ అభివృద్ది చేస్తాడని గెలిపిస్తే మూడున్నర సంవత్సరాలు నియోజక వర్గాన్ని అనాదను చేసి విదేశాలు తిరుగుతూ తన స్వంత స్వలాభం కోసం తప్ప ఎనాడు కూడా నియోజక వర్గ ప్రజల సమస్యలు తెలుసుకున్నది లేదు మునుకొడు నియోజక వర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాతి గులాములకు 18 వేల కోట్లకు అమ్మేసి నియోజక వర్గ అభివృద్ది కోసమే రాజీనామా చేశానని అబద్ధాలు చెపుతూ ఓట్లు అడగడానికి మన గ్రామానికి వస్తున్న రాజ్ గోపాల్ రెడ్డి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీ పార్టీ లో చేరి దేశం కోసం ధర్మం కోసం నేను బీజేపీ లో చేరి నరేంద్ర మోడీకి గుజరాత్ గులములకు వత్తాసు పలుకుతున్న వారు కొత్త డ్రామాలకు తెరలేపి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వాళ్లకు తగిన గుణపాఠం చెప్పి గ్రామ యువత ఆలోచించి ఎ రాజకీయ పార్టీ తో అభివృద్ది జరుగుతదో ఎవరు భవిషత్తు ఇవ్వగలరు అనేది ఆలోచించి మీరు, మీ కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలకు రేపు జరగబోయే ఎన్నికల్లో మన ఇంటి పార్టీ తెరాస కు కారు గుర్తుకు ఓటేసి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు బలపరిచిన తెరాస సీపీఎం పార్టీ అభ్యర్థి శ్రీ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ తెరాస సీపీఎం పార్టీ యూత్ నాయకులు కార్యకర్తలు బాన్సువాడ నియోజక వర్గ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.