పోచారం సురేందర్ రెడ్డి చోరువతో చిన్నారికి చుపోచ్చింది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  కోటగిరి మండల టాక్లి గ్రామానికి చెందిన కాంబ్లే లక్ష్మి బాయ్ మాలు దంపతులకు గత సంవత్సరం కవల పిల్లలు జన్మించారు ఇందులో నుంచి ఒక పాపకు కంటి సమస్య ఉండడంతో హైదరాబాద్ లోని LV ప్రసాద్ దవాఖానలో లక్షల్లో కర్చు ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో తో ఏంచెయ్యాలో తోచక చివరికి TRS పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించి LV ప్రసాద్ వైద్యులతో మాట్లాడి కంటి ఆపరేషన్ చేయించగా చిన్నారికి చూపు వచ్చింది కాగా శ్రీ పోచారం సురేందర్ రెడ్డి కి కుటుంబసభ్యులు,గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపి  పోచారం సురేందర్ రెడ్డి తల్లి  పేరు అయిన పుష్పమ్మ పేరును ఆ చిన్నారికి నామకరణం చేశారు కాగా ఈరోజు ఆ చిన్నారి జన్మదిన సందర్భంగా బీర్కుర్ మండల తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి  శ్రీనివాస రెడ్డి ఆశీర్వాదం తీసుకుని కేక్ కట్ చేశారు అనంతరం తెరాస పార్టీ నాయకులు  పోచారం సురేందర్ రెడ్డిని కలిసి తమ కూతురును చూపును ప్రసాదించిన పోచారం సురేందర్ రెడ్డి కి ధన్యాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్లి గ్రామ TRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.