మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పోచారం సురేందర్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కోటగిరి మండల కేంద్రము లోని TRS పార్టీ కార్యకర్త మొట్ట నడిపి సాయిలు ఆనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తెరాస పార్టీ నాయకులు శ్రీ పోచారం సురేందర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి TRS పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించి 10వేల రూపాయలను తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు.స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.