శ్రీ వారిని దర్శించుకున్న శాసనసభాపతి పోచారం

తెలంగాణ జ్యోతి/న్యూస్: బీర్కుర్ మండల తెలంగాణ తిరుమల దేవస్థానం లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి  శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తిరుమల దేవస్థానం కొండ పైన భక్తుల కొరకు నిర్మిస్తున్న వసతి గదుల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో మాట్లాడారు. వారితో పాటు తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి సైతం శ్రీ వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.