చాతుర్మాస దీక్ష విరమణ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ పోచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజాకాచార్య శ్రీ శ్రీ శ్రీ సుదర్శన ఆశ్రమం స్వామీజీ వారి చాతుర్మాస దీక్ష విరమణ కార్యక్రమానికి కాశీ గోవింద ఆశ్రమం స్వామీజీ, తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు శనివారం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి, స్పీకర్ సహోదరుడు  పోచారం శంభురెడ్డిలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి పాద పూజ మరియు స్వామి గారి శిష్యులు తెలంగాణ శాసన సభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి బీమరతశింతితో తులాబార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామిజి వారి భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.